పింఛ‌న్ కోసం ముప్పుతిప్ప‌లు

చిత్తూరు: తంబళ్లపల్లెలోని సిద్ధారెడ్డి కాలనీకి చెందిన డి రాజేశ్వరికి మాటలు రావు. పుట్టకతోనే మూగ. వికలాంగ పింఛన్‌ మంజూరు కోసం ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. మాటలు రావని చెప్పడానికి సాక్ష్యం కావాలని అధికారులు చెప్పడంతో వైద్యుల వద్దకు వెళ్లింది. వారిచ్చిన ధ్రువీకరణ పత్రంలో 42 శాతం మాత్రమే వైకల్యం ఉండడంతో రాజేశ్వరి పింఛన్‌పై ఆశలు వదులుకుంది. పర్సెంటేజీతో పనిలేకుండా వైకల్యం ఉన్నవారందరికీ పింఛన్‌ ఇవ్వాలని రాజేశ్వరి తన సహాయకురాలి ద్వారా జగన్‌ వద్ద మొరపెట్టుకున్నారు. 

తాజా వీడియోలు

Back to Top