మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్ వల్లే ప్రాణాలతో ఉన్నాను
01 Jun 2018 12:32 PM
పశ్చిమ గోదావరి: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వల్లే తన ప్రాణాలతో ఉన్నానని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీ అన్నారు. నరసాపురంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో లక్ష్మీ వైయస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకుంది. వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే తన ప్రాణాలు నిలబడ్డాయన్నారు. ఆయన చేసిన మేలుమరిచిపోలేనని, వైయస్ కుటుంబానికి కృతజ్ఞురాలిగా ఉంటానన్నారు. ఈ మేరకు వైయస్ జగన్కు వైయస్ఆర్ సంతకంతో కూడిన లేఖను ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు. అనంతరం లక్ష్మీ మాట్లాడుతూ.. తన ఆరోగ్యం బాగులేదని తెలిసి వైద్యం చేయించుకోమని లేఖ పంపించిన మహానుభావుడు వైయస్ఆర్ అని గుర్తు చేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎక్కడుందో తెలియదని, కనీసం అంబులెన్స్లు కూడా కనిపించడం లేదని లక్ష్మీ కోడలు శాంతి అన్నారు. వైయస్ఆర్ వల్లే తమ కుటుంబం సంతోషంగా ఉందన్నారు.