రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం

 
తూర్పుగోదావరి :ఫీజు రీయింబర్స్‌మెంటు వస్తుందన్న ఆశతో బీటెక్‌ చదివామని నేటికి రాలేదని వైయ‌స్‌.జగన్‌ వద్ద విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురానికి చెందిన ఎన్‌.వివేక్, కె.శివతేజ. బ్యాంకు రుణాలతో బీటెక్‌ పూర్తి చేశామని, రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని ఆశగా ఎదురుచూసినా రాలేదని పేర్కొన్నారు. చదువు పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లు ఇవ్వాలని కళాశాల యాజమాన్యాన్ని అడిగితే ఫీజులు చెల్లించాలన్నారు. పేరుకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంటు అనడం తప్ప ఎక్కడ అమలుకావడం లేదని వాపోయాడు.

తాజా వీడియోలు

Back to Top