వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టమాట జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
02 Dec 2017 10:32 AM
కర్నూలు: మా ప్రాంతంలో టమాట జ్యూస్ ప్యాక్టరీ ఏర్పాటు చేయాలని స్థానికులు వైయస్ జగన్ను కోరారు. ప్రజాసంకల్ప యాత్రగా భాగంగా శనివారం పత్తికొండ రైతులు వైయస్ జగన్ను కలిశారు. వలసల నివారణకు కొత్తపల్లి రిజర్వాయర్ నుంచి పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాలకు సాగునీరు అందించాలన్నారు. నియోజకవర్గంలో పత్తికొండతో పాటు అన్ని మండలాల్లో నిరుద్యోగులు చాలామంది ఉన్నారని, పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించాలని కోరారు. కొత్తపల్లి రిజర్వాయర్ వద్ద ఫిల్టర్ ట్యాంకు ఏర్పాటు చేసి పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాలతో పాటు ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ, ఆస్పరి మండలాల్లో ఖరీఫ్లో అత్యధికంగా టమాట సాగు చేస్తారని, రైతుల కోసం టమాటజ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని జననేతను కోరారు. మన ప్రభుత్వం వచ్చాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వైయస్ జగన్ వారికి హామీ ఇచ్చారు.