రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
నష్టాలను ఎదుర్కోలేక ఆత్మహత్యలు
15 Mar 2018 12:11 PM
గుంటూరు: తమలపాకు పంటకు కూడా ఇతర వాణిజ్య పంటల మాదిరిగానే బీమా సౌకర్యం కల్పించాలని మండల తమలపాకు రైతులు కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పొన్నూరు చేరుకున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డిని కలసి సమస్యలు విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగువేల ఎకరాల్లో తమలపాకు సాగవుతోందన్నారు. ఎకరాకు రెండు లక్షల వరకు పెట్టుబడి అవుతుందని వివరించారు. నలభై ఏళ్ల నుంచి పంటకు తెగుళ్లు, వైరస్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోయారు. నష్టాలను ఎదుర్కోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమలపాకు పంటకు కూడా బీమా కల్పిస్తే రైతులకు మేలు చేకూరుతుందని వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. సీహెచ్ సుధాకర్రెడ్డి, దుర్గారావు, బి.రంగబాబు, పి.రామచంద్రరావు, సీహెచ్ దుర్గయ్య తదితరులున్నారు.