సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

తూర్పుగోదావరి : సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నాయకులు జి.మురళీకృష్ణ, భాస్కర్‌రెడ్డి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప యాత్రలో  వారు జగన్‌ను కలుసుకుని ఈ మేరకు వినతి పత్రం అందించారు. సీపీఎస్‌ విధానంపై రెండున్నరేళ్లుగా పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలంబిస్తోందన్నారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, రాష్ట్ర పరిధిలో లేదని చెబుతోందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తరువాత వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. పాదయాత్రలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేస్తానని ప్రకటించడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు.
Back to Top