ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
కోమాలో తెలుగుదేశం
19 May 2016 10:46 PM
2014 మే నెలలో ఎన్నికలు జరుగుతూ వుండగా సుబ్బారావు కోమాలోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు వాగ్దానాలు వినివిని కళ్ళు తిరిగి ఆయన ఆస్పత్రి పాలయ్యారు.
2016 లో కోమా నుంచి కోలుకున్నాడు.
`` రెండేళ్ళ తరవాత మళ్ళీ మామూలు మనిషియ్యారు`` అన్నాడు డాక్టర్
``రెండేళ్ళా ! అయితే ఆంధ్రప్రదేశ్ లో అద్భుతాలు జరిగిపోయి ఉంటాయి. ఇవన్నీ చూసే భాగ్యం నాకు లేకుండా పోయింది డాక్టర్ ``అని సుబ్బారావు బోరున ఏడవసాగాడు.
`` మీరెందుకు ఏడుస్తున్నారో నాకు తెలియదు. కానీ బయటికేలితే మీకు చాలా అద్భుతాలు కనిపిస్తాయి `` అని డాక్టర్ డిశ్చార్జ్ చేసి పంపాడు.
విజయవాడ నడిబొడ్డున సుబ్బారావు నిలబడగానే ఒక యువకుడు ఎదురయ్యాడు `` బాబోస్తే జాబోస్తుందన్నారు. వచ్చిందా బాబూ? `` అని ఆ కుర్రాన్ని అడిగాడు సుబ్బారావు.
``బాబేంటి? జాబేంటి ?`` అని ఆ కుర్రాడు భయంగా అడిగాడు.
`` చంద్రబాబు వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు కదా? ``
`` ఆయనకీ ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది. మాకెవరికీ జాబు రాలేదు, జవాబూ రాలేదు `` అని వెళ్ళిపోయాడా కుర్రాడు.
ఇంతలో ఒక బక్కచిక్కిన రైతు కనిపించాడు.
`` రైతన్నా, నీ రుణాలు మాఫీ అయ్యాయా ? నీ పంట పండిందా ? అని అడిగాడు.
``పంట ఏందీ, ఇంట్లో వంట కూడా లేకుండా పోయింది. అందుకే వలస పోతున్నాం``
``అదేంటి పరాయి రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు మన అభివృద్ధిని చూసి వలస వస్తారనుకుంటే మీరే వలస వెలుతున్నారా?``
`` అభివృద్ధి అంటే నాయకుల అభివృద్దే కానీ, ప్రజల అభివృద్ధి కాదు బాబూ``
`` ఇంతకూ రాజధాని ఎక్కడ కడుతున్నారు?``
`` అమరావతిలో ``
`` ఈ రెండేళ్ళ లో కట్టేశారా ?``
`` రైతుల భూములన్నీ కొట్టేశారు ``
``మరి ఈ రెండేళ్లలో ఏం చేశారు ?``
``3 డి సినిమా చూపించారు ``
`` అంటే ?``
`` తెలుగుదేశం అద్దాలు పెట్టుకున్నవారికి అభివృద్ధి కళ్ళముందు ఎగురుతూ వుంటుంది. అద్దాలు లేని వాళ్లకి అంతా మసకే `` అని రైతు వెళ్ళిపోయాడు.
సుబ్బారావు గందరగోళంగా వెళుతుంటే ఒక కార్మికుడు కనిపించాడు .
``ఏమయ్యా, పరిశ్రమలల్నీ తరలి వచ్చాయా ? `` అని అడిగాడు
`` పరిశ్రమలంటే ఏంటది ?`` అని బుర్రగోక్కుంటూ అడిగాడు కార్మికుడు
``అదేంటి, చంద్రబాబు అధికారంలోకి వస్తే వందలు వేల పరిశ్రమలు వస్తాయన్నారు. ``
`` రాష్ట్రానికి ఏ మోచ్చాయో తెలియదు కానీ, మాకు మాత్రం పోయే కాలం వచ్చిందండి. పనిలేదు, తిండి లేదు ``
`` ఇంతకూ ప్రత్యేక హోదా వచ్చిందా లేదా ? ``
`` హోదానా? అంటే ఏంటండి ? సాదా పాన్ తెలుసు కానీ ఈ హోదా అంటే ఏంటో తెలియదండి ``
చదువులేని వాళ్ళతో మాట్లాడి లాభం లేదనుకుని దారిన వెళ్తున్న ఒక ఉద్యోగిని ఆపి `` ఏమండి, రాష్ట్రానికి ప్యాకేజీ వచ్చిందా ? `` అని అడిగాడు.
`` ప్యాకేజీ కాదు కదా, స్టీల్ క్యారేజీ కూడా రాలేదండీ``
``మరి ఈ రెండేళ్లలో ఏం జరిగింది ?``
`` చంద్రజాలం, కనికట్టు, అరచేతిలో స్వర్గం ``
`` నదుల అనుసంధానం కూడా జరగలేదు``సుబ్బారావు బుర్ర గోక్కుని మళ్ళీ ఆస్పత్రికి వెళ్ళిపోయాడు.
``డాక్టర్ నన్ను మళ్ళీ కోమాలోకి పంపండి ``
`` ఎందుకలాగా ?``
``బయట ప్రభుత్వమే కోమాలో వున్నప్పుడు ప్రజలు ఉంటే తప్పేంటి ``