గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
ఔను వాళ్లిద్దరూ కలిసున్నారు
02 Jan 2019 12:04 PM
ఔను ఇది నిజమే వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు. విడిపోయినట్టు, విమర్శలు చేసుకుంటున్నట్టు కనిపించారంతే. కానీ వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు. ఒకరిని అంటే మరొకరికి కోపం వచ్చేంత ఇదిగా ఇద్దరూ కలిసే ఉన్నారు. మేం ఒకరికి ఒకరై కలిసుంటే రాష్ట్రానికి నష్టమేంటని ప్రజల్నేప్రశ్నించేంత పచ్చగా కలిసున్నారు. మరి కలిసున్నప్పుడు కలిసున్నట్టే ఉండక, కలిసుండనట్టు కటింగులు ఎందుకిస్తున్నారు??
బాబు గారి నోట మళ్లీ ఒక కుట్ర లాంటి మాట బటయకొచ్చింది.
నిన్నటి వరకు జగన్, పవన్, మోదీ ఒక్కటయ్యారంటూ ఊకదంపుడు డబ్బాకొట్టిన బాబు, అది కాస్తా వర్కవుట్అవ్వకపోయే సరికి అసలు విషయం బయటపెట్టాడు. ఇప్పుడు తన తప్పుడు ప్రచారంలో పవన్పేరుడిలీట్చేసిన బాబు, ఆయనతో తన కున్న దోస్తీని చెప్పకనే చెప్పాడు. పైగా ఒకడుగు ముందుకేసి ‘అవును.. మేము పవన్కలిస్తే జగన్కేంటి, ఎపికేంటి?’ అంటూనిస్సిగ్గుగా ప్రశ్నించాడు.
తన తప్పులు కప్పుకోడానికి ఎప్పుడూ ఏదో ఒక తోలుకప్పుకుని డోలు వాయించే చంద్రబాబు..ఇప్పుడు కొత్తగా కేసిఆర్, మోదీ, జగన్ ఒక్కటే అంటూ కుట్ర రాగం అందుకున్నాడు. పవన్పేరు ఎందుకు వదిలేశాడా? అని జనం ఆలోచించే లోపేం తనకు జనసేనకు ఉన్నఒప్పందం గురించి ఒక్కసారి మళ్లీ గుర్తు చేశాడు.
ఎన్నికలు దగ్గరకొస్తున్నాయికదాం ఇక నెమ్మదిగా అసలు రంగులు బయట పెడితే బెటర్అ నుకున్నాడేమో..! అప్పుడే ఏమైంది బాజాం రేపుం బాబు గారు ఒక్కడే రాష్ట్రం కోసం పాటుపడలేకపోతున్నారని..అందుకే ఆయనతో కలిశానని పవన్..
పవన్ ప్రశ్నించడం వల్లే ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశామని బాబు చెప్పినా చెబుతారు ఖర్మ..!