సీఎం వైయస్ జగన్ను కలిసిన నాబార్డ్ చైర్మన్
28 Jan, 2023 18:59 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని నాబార్డ్ చైర్మన్ షాజీ.కే.వీ, నాబార్డ్ ప్రతినిధుల బృందం తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాబార్డు చైర్మన్ను సీఎం వైయస్ జగన్ సన్మానించారు. అనంతరం ఇరువురు పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.