‘స్పందన’పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
26 Nov, 2019 13:08 IST
సచివాలయం: స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. సచివాలయంలో సమీక్షా సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలమ్ సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.