జోబైడెన్..పుతిన్కు కూడా బాబు ఉత్తరాలు రాస్తాడేమో?
13 Feb, 2021 11:35 IST
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును ట్విట్టర్ వేదికగా వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఎండగట్టారు. చంద్రబాబు రాష్ట్రపతికి, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాశాడు. పిచ్చి ముదిరి జో బైడెన్, పుతిన్ కు కూడా ఉత్తరాలు రాస్తాడు. ఈసారి కేంద్ర బలగాలు కాదు, అమెరికా సైన్యం, ఐకాస శాంతి దళం పంపాలని కోరతాడు. చివరకి చిత్తుగా ఓడింది టీడీపీ కాదు, ప్రజలే అంటూ తృప్తి పడతాడు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.